స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9 నుండి గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. నకిరేకల్ లో గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెల యూనిట్ ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్ లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. గొర్రెల యూనిట్ ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 8వ తేదీన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.