రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. గుంటూరు జిల్లా పత్తిపాడులో విద్యాకానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. పత్తిపాడు నియోజవర్గానికి కనివినీ ఎరుగని రీతిలో తనను 42వేల మెజార్టీతో గెలిపించారని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీ తత్వంతో చదవడం విద్యార్థుల బాధ్యత అని, తమకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసే బాధ్యత తమదని ఆయన స్పష్టంచేశారు.


