దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో దివ్యాంగుల జాబ్ పోర్టల్ను ఆమె ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. దివ్యాంగులు జాబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు. సంక్షేమ నిధుల్లో వారికి ఐదు శాతం కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లోనూ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్లో 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో వారికి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని సీతక్క తెలిపారు.