టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ మూవీని హ బడ్జెట్తో పాన్ ఇండియా మల్టీస్టారర్గా తెరకెక్కిస్తున్నారు.
మార్కోతో హనీఫ్ తనలోని మాస్, వయలెన్స్, యాక్షన్ యాంగిల్ను చూపించారు. ఇక ఇప్పుడు ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇక ఈ ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురు ఫిల్మ్స్కు చెందిన సునీతా తాటి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.