25.2 C
Hyderabad
Friday, November 14, 2025
spot_img

ఘాట్ రోడ్లలో డేంజర్ జోన్ల గుర్తింపునకు టీటీడీ చర్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్లలో గత నెలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల టీటీడీ దృష్టి సారించింది. ఈ విషయం మీద టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనిపై ధర్మ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే డేంజర్ జోన్లను గుర్తించి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్లపై ఎక్కడ ప్రమాదం జరిగినా సత్వరమే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఇక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండాలని ధర్మారెడ్డి సూచించారు. అంతేకాకుండా, తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేసే ధర్మ రథం బస్సులను రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో తిప్పాలని అధికారులకు నిర్దేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్