స్వతంత్ర, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరి వద్ద నుంచి ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి ఆచూకీ కోసం మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
ఖానాపూర్కు చెందిన జాకీర్ అనే వ్యక్తి ఇటీవల పనిలో చేరాడని.. అతడు ఇచ్చిన సమాచారంతో చోరీకి ఈ ముఠా ప్లాన్ చేసిందన్నారు. నిందితులు సూర్య నటించిన ‘గ్యాంగ్’ ,అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి చోరికి స్ఫూర్తి పొందారని సీపీ వెల్లడించారు.
కాగా ఈనెల 27వ తేదీన సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ జ్యూవెలర్స్కు ఐటీ అధికారులం అని ఆరుగురు నిందితులు వచ్చారు. అనంతరం సిబ్బందిని ఓ గదిలో బంధించి కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కెట్లతో పారిపోయారు. షాప్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.