33.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

లింగమయ్య జాతరలో కిక్కిరిసిన భక్తులు… ముగ్గురు మృతి

Saleshwarm Jathara | దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు భక్తులు అనంతలోకాలకు  చేరారు. దేవుణ్ణి దర్శించుకుందామన్న  తపనతో వెళ్లిన భక్తులను మృత్యువు కబళించింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి అందాల నడుమ ఉన్న లోయలో కొలువైన లింగమయ్యను దర్శించుకోవడానికి కాలినడక అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. భక్తులు కిక్కిరిసిపోవడంతో ఊపిరాడక ఒక వ్యక్తి.. తొక్కిసలాటలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. గుండెపోటుతో మృతి చెందిన మహిళను అమన్‌గల్‌కు చెందిన విజయగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులు నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు.


Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్