జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ను సిపిఎం నేతలు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్లోనీ కుంగిన పిల్లర్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ను తాత్కాలిక మరమ్మత్తులు చేసి రైతులకు నీరు అందించాలని అన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్లోనే అత్యధిక ఖర్చు చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని సీపీఎం నేతలు అన్నారు. అలాంటి ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ కుంగిపోవడం దారుణమ న్నారు. మేడిగడ్డ కుంగిపోవడం పై న్యాయ విచారణ చేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


