Corona Updates | దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,158 మంది కోవిడ్ బారిన పడినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ లో వెల్లడించింది. అయితే ఈ కేసులు ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 4.42శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 44,998 (0.10శాతం)కి చేరగా… రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
Read Also: కల్తీ కల్లు కలకలం.. 40 మందిలో ముగ్గురు మృతి
Follow us on: Youtube, Koo, Google News