దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కల్గిస్తోంది. అయితే కేసులు పెరిగినా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో కరోనా ఎండెమిక్ స్టేజ్(Endemic Stage)కు చేరుకుంటుందని.. ఆ తర్వాత కేసులు తగ్గిపోతాయని తెలిపారు. ఎండెమిక్ స్టేజ్ అంటే ఓ వ్యాధి ప్రజల మధ్యే ఉండే స్టేజ్ గా చెప్పారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే తట్టు, ఫ్లూ, మశూచి వంటి వ్యాధుల లాంటిదే కరోనా కూడా అని పేర్కొన్నారు. కరోనా కూడా జనాల మధ్యే దీర్ఘకాలికంగా ఉండిపోతుందన్నారు. అయితే దీని వల్ల ఎక్కువ ప్రాణ నష్టం ఉందన్నారు.