తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు 14 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుం దన్నారు. పలు పోలింగ్ బూత్లను సందర్శించిన తర్వాత మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటువేసి, ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత భారీ మెజారిటీతో గెలుస్తున్నారని వారికి ముందస్తుగా శుభా కాంక్షలు తెలిపారు.