మహబూబాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీపై..ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. మాలోతు కవితను శూర్పణఖ, తండ్రి రెడ్యా నాయక్ను రావణాసురుడితో పోల్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో రావణాసురుడిని ఇప్పటికే సంహరించామని..పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అయిన కవిత పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కవితకు ఎంపీగా అవకాశం ఇవ్వొద్దన్నారు. మహబూబా బాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కవితపై రామచంద్రనాయక్ మండిపడ్డారు.