15.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర: సూర్జేవాలా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఎన్నికలు దగర్గపడిన వేళ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ ఇంఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ మీడియాకు విడుదల చేశారు. ఖర్గే, ఆయన భార్య, పిల్లలను అంతం చేయండి అంటూ చిత్తాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ అన్నట్లుగా ఆడియోలో ఉంది.

కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఖర్గేను అంతం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సూర్జేవాలా తెలిపారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చివరికి హత్యా రాజకీయాలకు సైతం బీజేపీ తెరలేపిందని ఆయన ఆరోపించారు. రాథోడ్‌కు ప్రధాని మోదీ, సీఎం బసవరాజ్‌ బొమ్మై అండదండలు కూడా ఉన్నాయన్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను మణికంఠ రాథోడ్ తీవ్రంగా ఖండించారు. అది ఫేక్ ఆడియో అని.. ఓటమి భయంతోనే తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్