25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

ఆదిలాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన డైట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు .సీఎం సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం వరకే బహిరంగ సభ ముగిసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వాటర్ బాటిల్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందు బాటులో ఉంచారు. డైట్ మైదానం వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్