సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండో రోజు ఆయన హస్తిన పర్యటన కొనసాగనుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిన్న రాజ్ నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు రేవంత్. రాష్ట్రా నికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏఐసీసీ కార్యా లయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ రేవంత్ సమావేశమ య్యారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారని సమాచారం. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇటీవలె ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.