వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కోసం జరిగే స్ట్రీట్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కావ్యను గెలిపించడమే లక్ష్యంగా వరంగల్ పోచమ్మ మైదానంలో స్ట్రీట్ మీటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ పోచమ్మ మైదానం జంక్షన్ లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం సభకోసం లైటింగ్, బారీ కేట్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వచ్చే కార్యకర్తలకు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సుమారు 20,000 మంది ఈ సభకు హాజరవుతారని రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయుబ్ మహమ్మద్ తెలిపారు.