తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. భట్టి కూడా పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అవుతారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.