30.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్​రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి ఆయన హాజరుకానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీతోపాటు కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణపైనా ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణపై నెల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ సమయం కుదిరితే రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్​ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 9న సెక్రటేరియెట్​ ప్రాంగణంలో లక్ష మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీ, మల్లికార్జున​ ఖర్గేను సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

వ్యవస్థలు పనిచేయని కారణంగానే..చేయి చేసుకోవడంపై ఈటల క్లారిటీ

హైదరాబాద్‌ చుట్టుపక్కల పేదల భూముల్లో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌. వ్యవస్థలు పనిచేయని కారణంగానే ఎంపీగా తాను వెళ్లి మేడ్చల్‌ జిల్లాలో మాఫియాపై చేయి చేసుకున్నానని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్