స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరుస తీపికబుర్లు అందిస్తోంది. మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుధ్ద్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన సీఎం కేసీఆర్.. తాజాగా కల్లు గీత కార్మికులకు శుభవార్త అందించారు. రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికులకు ప్రత్యేక బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం తరపున రూ.5లక్షల బీమా అందనుంది. నేరుగా బాధితుల కుటుంబ ఖాతాలోనే డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గీత కార్మికుల బీమాకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ఎక్సెజ్, ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.