25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

   లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్ష పార్టీలు ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారు. మహిళలు, యువకులు, కార్మికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు.

    జగన్‌ బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి 9వ రోజు యాత్రను ప్రారంభించారు. కోవూరు క్రాస్‌ మీదుగా రాజు పాలెం వద్దకు చేరుకున్నారు. అక్కడ జగన్‌ను కలిసేందుకు అభిమానులు పోటెత్తారు. జగన్‌ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.తిప్ప, గౌరవరం మీదుగా RSR ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్‌ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనం తరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్‌ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్