స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వలసల ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారబోతోందని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసిన అనంతరం.. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.. అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు దాదాపు సమానదూరంలో ఉంటుందని.. 2026లో ఈ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సం తానే చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని.. డేటా సెంటర్ తో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే తాను కాపురం పెడతానని మరోసారి జగన్ స్పష్టంచేశారు.