ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. తన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ను అభినందించారు.
ఇక, జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖులు కలిసి చెక్స్ అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. సినీ నటుడు అలీ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. హీరో విశ్వక్ సేన్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించారు.