16.7 C
Hyderabad
Monday, January 19, 2026
spot_img

పింఛన్ల పంపిణీపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫెరెన్స్‌

  సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. జులై ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయా లని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు చొప్పున కేటాయించాలన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మొత్తం నాలుగు రకాల క్యాటగిరీల పింఛనుదారులలో, 11 సబ్ క్యాటగిరీలకు చెందిన పెన్షన్ దారులకు మొత్తం 7000 పంపిణీ చేయాలని ఆదేశించారు. జులై నెలకు సంబంధించి 4000, ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించి 1000 చొప్పున ఏరియర్స్ 3000పంపిణీ చేయాలని సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్