28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు

   రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్‌ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారం లో మూడు రాజధానుల నాటకమా డారని చెప్పారు. మూడు రాజధానులు కాదు. ఒక్క రాజధాని అయినా కట్టారా అని ప్రశ్నించారు. జగన్‌ ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగారని, నేడు జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని చంద్ర బాబు ప్రజలకు సూచించారు. ప్రజల కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని కోరారు. వైసీపీని చిత్తచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ అంటూ ఫైర్ అయ్యారు. కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్