స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని తెలిపారు. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోందని.. మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమైందని హెచ్చరించారు. సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులు, వేధింపులకు భయపడే నేత కాదని.. ఎదిరించి పోరాడే నాయకుడని పేర్కొన్నారు. పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. తక్షణమే స్వామిని విడుదల చేయాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు…..ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం… pic.twitter.com/ExboJaVHIR
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2023