26.7 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 సీజన్‌ కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ముడి జూట్ ఎంఎస్పీ మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్‌కు 315 పెంచింది. 2025-26 సీజన్‌లో ముడి జనపరాన ముడి జనపరాన కనీస మద్ధతు ధర క్వింటాలుకు 5వేల 650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8 శాతం రాబడిని ఇస్తుందని కేంద్రం పేర్కొంది.

జాతీయ ఆరోగ్య మిషన్‌ను వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత పదేళ్లలో ఆరోగ్య మిషన్ చారిత్రాత్మక లక్ష్యాలను సాధించిందని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ అన్నారు. 2021-2022 మధ్య, సుమారు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు జాతీయ ఆరోగ్య మిషన్లో చేరారని, ఈ మిషన్ కింద భారతదేశం COVID-19 మహమ్మారిపై పోరాడిందని గోయల్ చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్