తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, షఫలి వర్మ, రేణుక సింగ్, పూజ వస్త్రకర్, దీప్తి శర్మ దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, నల్లారి కిషోర్ కుమార్రెడ్డి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వ చనం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశా రు.


