అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వివాదాలకు మారుపేరు. ఆధునిక అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు కనిపించరు. ట్రంప్ జీవితంలో ప్రతి అధ్యాయంలోనూ వివాదాలు కనిపిస్తుంటాయి.
2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డొనాల్ట్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్రను డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. ఆ తరువాత ఆయన మరోసారి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇది చిన్నా చితకా వివాదం కాదు. అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు కాకపోతే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రక్తపాతం జరుగుతుందం టూ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికాలో దుమారం రేపింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై అమెరికా రాజకీయవర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలు రానున్న ప్రమాదాన్ని శంకించాయి. వెంటనే వెనక్కి తగ్గాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని ఆయన ప్రతినిధులు వివరణ
ఇచ్చారు.
ట్రంప్ను రక్షించడానికి తమకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నించారు. చివరకు రక్తపాతం కామెంట్ సుఖాంత మైంది. కిందటేడాది ఏప్రిల్లో శృంగార తార స్టార్మీ డేనియల్స్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. తనతో పెట్టుకున్న అక్ర సంబంధం బయట పెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారనేది డొనాల్డ్ ట్రంప్పై కొన్ని నెలల కిందట వచ్చిన ఆరోపణ. ఈమేరకు తన మాజీ న్యాయవాది మైఖేల్ కొహెన్ ద్వారా స్టార్మీ డేనియల్స్ కు 1,30,000 డాలర్లు చెల్లించారన్నది ట్రంప్పై వచ్చిన ఆరోపణ. స్టార్మీ డేనియల్స్ కు సొమ్ములు చెల్లించిన విషయాన్ని ఇటీవల మైఖేల్ కొహెన్ అంగీకరించడం విశేషం.
డోనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాల నమోదుకు మన్హటన్ గ్రాండ్ జ్యూరీ అనుమతించింది. స్టార్మీ డేనియల్స్ ఆరోపణల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్పై కేసు నమోదైంది. అయితే ఇదంతా డెమొక్రట్ల కుట్ర అంటూ కొట్టిపడేశారు డొనాల్డ్ ట్రంప్. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి న్యాయవ్యవస్థను డెమొక్రట్లు ఉపయోగించుకుంటున్నారని ఎదురుదాడి చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదురుదాడి సంగతి ఎలాగున్నా ఈ వివాదం అమెరికాలో దుమారం రేపింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట డొనాల్డ్ ట్రంప్పై అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన ఆరోపణలు నమోదయ్యాయి. రికో చట్టం ఉల్లంఘన అంటే సాదాసీదా వ్యవహారం కాదు. క్రిమినల్ సిండికేట్ల అణచివేతకు రికో చట్టాన్ని ఉపయోగిస్తారు. అలాంటి రికో చట్టం ఉల్లంఘనలో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ సహా 18 మందిపై అభియోగాలు నమోదు చేసింది ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ. తప్పుడు వాంగ్మూలాలు, దొంగ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ, సాక్షులను ప్రభావితం చేయడం, చట్టాల ఉల్లంఘన వంటి మరికొన్ని అభియోగాలను ట్రంప్ సహా 18 మందిపై మోపారు. ఈ మొత్తం ఆరోపణల్లో రికో చట్టం ఉల్లంఘనలు చాలా తీవ్రమైనవి. అయితే ఈ ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ బృందం స్పందించింది. ఇందుకు సంబంధించి ప్రాసిక్యూటర్ పక్షపాతంతో వ్యవహరించారని దుయ్య బట్టింది.డొనాల్ట్ ట్రంప్ పై విమర్శలు, ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆయనలో మరో కోణం ఉంది. అమెరికా ప్రెసి డెంట్ గా ఉన్నంతకాలం భారత్ కు డొనాల్డ్ ట్రంప్ స్నేహహస్తం అందించారు. భారత్తో సంబంధాల బలోపేతానికి డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకున్నారు.