తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్య ర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానే శ్వర్ తరపున ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. మహేశ్వరం నియోజకవర్గం లేమూర్ గ్రామంలో ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్ధించారు. కాసాని జ్ఞానేశ్వర్ కుమారులు కాసాని సుధాకర్, కాసాని సతీష్, కోడలు కాసాని శ్వేత ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.


