స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని అన్నారు. కేసిఆర్ పాలన నిజాం పాలన నాటి దోపిడీని తలపిస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు లేవన్న భట్టి.. ప్రజల్లో ఉన్నవారికే సర్వేల ద్వారా అధిష్టానం టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోని నేతలు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని భట్టి వ్యాఖ్యానించారు.