24.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

సెన్సార్ బోర్డుకు లంచం.. వ్యవస్థనే కుదిపేసిన విశాల్..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు. విడుదలకు ముందు మార్క్ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్ ను సెన్సార్ బోర్డు కు పంపించగా.. అక్కడ సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ కావాలంటే రూ.6.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్టుగానే విశాల్ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తరువాత సెన్సార్ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్టు.. దానికి సంబంధించిన బ్యాంక్ చలానా సోషల్ మీడియాలో షేర్ చేశారు విశాల్. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర పై సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్ బోర్డు సభ్యులు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్ కార్యదర్శి హరి కుమార్ ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. హరికుమార్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విశాల్ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద సినిమాలకు చెన్నైలోనే సెన్సార్ సర్టిఫికెట్ అందించేవిదంగా చర్యలు తీసుకుంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్