స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మాదాపూర్లో గల సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ టీసీఎస్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. కంపెనీలో బాంబు పెట్టినట్లు ఎవరో బెదిరింపు కాల్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాల్ వచ్చిన వెంటనే టీసీఎస్ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులను అందరిని బయటికి పంపించి బాంబు స్క్వాడ్తో టీసీఎస్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబ్ పెట్టమని బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించినట్లు సమాచారం. ఇతన్ని పట్టుకునేందుకే పోలీసులు తనిఖీ చేస్తున్నారు.