ప్రముఖ సినీనటి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విశాఖపట్నంలో సందడి చేసింది. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో ఫ్యాషన్ టూర్ పేరుతో ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్డీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్నా వేదికపై కొద్దిసేపు ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఫ్యాషన్, టెక్నాలజీ, వినోదాన్ని మిళితం చేసి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వైభవోపేతంగా జరిగింది. ఈ ఫ్యాషన్ టూర్ ఈ నెల 23న గౌహతిలో జరుగనుంది.