కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందన్నారు. బీజేపీది వికాస భారత్ నినాదమని.. కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదమని విమర్శించారు. ఓట్ల కోసమే ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉచితాలు, గ్యారెంటీ హామీలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.


