17.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

మంత్రి తలసానిపై రాజాసింగ్ పొగడ్తల వర్షం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకులపై రెచ్చిపోయే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై మాత్రం ప్రశంసలు కురిపించారు. మంత్రిగా తలసాని చాలా బాగా పనిచేస్తున్నారని.. సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని తెలిపారు. రాజాసింగ్ నియోజకవర్గమైన గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

అనంతరం లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను అందించారు. కొంత ఆలస్యమైనా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడం.. చాలా సంతోషంగా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. మరికొందరు పేదలు కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు కట్టి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల సచివాలయానికి తనను ఆహ్వానించి తలసాని అవమానించారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా ఆయనను పొగడడం హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్