స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎక్కడా లేని బండి.. దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం బండి సంజయ్ అవివేకమన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు. నిజమాబాద్ లక్కోరా లోని వేల్పుర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల పాల్గొని బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.