17.7 C
Hyderabad
Wednesday, January 8, 2025
spot_img

సారీ చెప్పిన బాలయ్య

దేవ బ్రాహ్మణుల్ని ఉద్దేశించి హీరో బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రావణాసురుడి వారసులు అన్న రీతిలో ఆయన మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ కావటంతో ఈ వ్యాఖ్యలు కోసం నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని బీసీ కులాల్లో దేవ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగానే కనిపిస్తారు. కొన్ని గ్రామాల్లో గణనీయమైన సంఖ్యలో ఈ సామాజిక వర్గం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో బీసీ సంఘాల్లో ఈ కులస్తులు చురుకైన పాత్ర పోషిస్తారు. అందుచేత బాలయ్య చేసిన వ్యాఖ్యలు బీసీలను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. ఈ దుమారాన్ని తెలుగుదేశం పెద్దలు గమనించి అప్రమత్తం అయ్యారు. వెంటనే బాలక్రిష్ణ కు పరిస్థితిని వివరించినట్లు సమాచారం.

ఈ వ్యాఖ్యల మీద బాలయ్య వెంటనే వివరణ ఇచ్చారు. పొరపాటుని మన్నించాలంటూ వివరణ ఇచ్చారు. ఈ మాటల వల్ల దేవాంగుల మనో భావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధ పడ్డానని, ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచనే తనకు లేదని ఆయన వివరించారు. సాటి సోదరుల మనసు గాయపరచాలని అనుకోవటం లేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ఆవేశంగా మాట్లాడుతుండే బాలయ్య.. ఈ వివాదంలో వెంటనే జాగ్రత్త పడ్డారు. బీసీ వర్గాల్లో అనవసరపు వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు వెంటనే వివరణ ఇచ్చారు. హుందాగా సారీ చెప్పటంతో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నారు

Latest Articles

బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : నిర్మాత నాగవంశీ

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్