డబ్బు సంపాదన కోసం తాను ఎప్పుడూ రాజకీయం చేయలేదని బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి అన్నారు. నియోజక వర్గం కార్యకర్తల అభివృద్ధి కోసమే తాను రాజకీయం చేశానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తాను వచ్చి 11 ఏళ్లు అవుతుందని ఇంతవరకు ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదన్నారు. ఇప్పుడు కూడా తన కార్యకర్తలు, నాయకులు, జగన్, వైసీపీ కోసం పనిచేస్తానని సిద్ధార్ధ్రెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో కలిసి బైరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని సిద్ధార్థ్రెడ్డి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఏ వైసీపీ కార్యక ర్తకు అన్యాయం జరిగినా, దాడులు జరిగినా సహించబోమని సిద్ధార్థ్రెడ్డి హెచ్చరించారు.


