స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి అంతస్తు పనులు జరుగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. ఆ పోస్ట్లో కొన్ని ఫొటోలను విడుదల చేసింది. అందులో మొదటి అంతస్తు కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆలయ నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తి చేయాలని లార్సెన్ అండ్ టుబ్రో ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పని చేస్తున్నారు. అయితే వర్షాల కారణంగా పనులకు ఆటంకం ఏర్పడుతోంది. టాటా కన్సల్టెన్సీ సంస్థతో సహా ఇతర సాంకేతిక కంపెనీలు కూడా తమ మద్దతు పలుకుతున్నాయి. 2024 సంక్రాంతి పర్వదినం జనవరి 14 నుంచి 24 వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని ఇటీవల ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ఆ పది రోజుల పాటు వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.
శరవేగంగా అయోధ్య రామాలయ పనులు.. సంక్రాంతి రోజు దర్శనం
Latest Articles
- Advertisement -