19.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

అడ్డుఅదుపు లేకుండా దళిత మహిళలపై అఘాయిత్యాలు: పీతల

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి పీతల సజాత. రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపడం దారుణమని తెలిపారు. గతంలో గుంటూరు జిల్లా, నకిరేకల్లు మండలం, శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు అదే తరహాలో హత్యగావించడం వైసీపీ గూండాల సైకోయిజానికి నిదర్శనమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే నని ఆరోపించారు.

వైసీపీ నాయకులకు దళిత మహిళలంటే ఎటువంటి భావన ఉందో ఈ సంఘటనతో బహిర్గతమైందన్నారు. జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే చిన్నచూపు. అందుకే వైసీపీ చిల్లర గ్యాంగ్ దళిత స్త్రీలపై పేట్రేగిపోతోందని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను టార్గెట్ చేసి హత్యలు చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనమని అన్నారు. దళిత అంగన్ వాడీ టీచర్ హనుమాయమ్మ హత్యపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాలను వెంటనే నిలుపుదల చేయాలి… అలాగే హంతకుడైన కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్