ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. సీటు కేటాయింపుపై ఎటువంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్ తనను రెండు దఫాలు కలుస్తానని… తర్వాత మొహం చాటేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు పవన్ బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నారు.