21.1 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

World Cup: పాక్ మరో డిమాండ్.. భారత్‌లో ఆడాలంటే ఈ పని చేయాలట..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందు ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంది. వాస్తవానికి, గతంలో ప్రచురించిన ప్రపంచకప్ షెడ్యూల్‌లో కొన్ని మ్యాచ్‌ల తేదీలను మార్చాలని ఐసీసీ, బిసీసీఐ ప్రతిపాదించాయి. నవీకరించిన ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల కానుంది. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ప్రపంచకప్ పోరుకు సంబంధించిన అధికారిక సమాచారం రానుంది. అయితే అంతకు ముందు ప్రపంచకప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు రానుందనే విషయం స్పష్టం చేయాలి. ఎందుకంటే పాకిస్థాన్ జట్టు భారత్‌కు రావడానికి పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కోసం పాకిస్థాన్ జట్టు ఎదురుచూస్తోంది. కాగా, ఐసీసీ నుంచి రాతపూర్వక హామీ రాగానే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ ఆడేందుకు పాక్‌ జట్టును పంపుతామని పాకిస్థాన్ ప్రభుత్వం ఐసీసీ ముందు కొత్త షరతు పెట్టినట్లు సమాచారం.

ప్రపంచకప్‌ ఆడేందుకు పాక్‌ జట్టును భారత్‌కు పంపాలా వద్దా అని నిర్ణయించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే కమిటీ సమావేశమై పాక్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని ఐసీసీ నుంచి రాతపూర్వకంగా హామీ ఇస్తేనే భారత్‌కు పంపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. కొన్ని నెలలుగా ఇందులో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విముఖత చూపుతోంది. ఆసియా కప్ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ప్రపంచకప్‌పై పాక్ బోర్డు మొండి వైఖరిని మెుదలుపెట్టింది.

జూన్‌లో ఐసీసీ అధికారులను కలిసిన తర్వాత పాకిస్థాన్ ఈ విషయంలో తన వైఖరిని మెల్లగా మార్చుకుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే జట్టును భారత్‌కు పంపిస్తామని పాక్‌ బోర్డు పేర్కొంది. ఆ తర్వాత ఈ విషయంపై పాక్ ప్రభుత్వం విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే కమిటీ బుధవారం సమావేశమై పాక్ జట్టు భద్రతకు సంబంధించి ఐసీసీ నుంచి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని, ఆ తర్వాతే జట్టును పంపేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రఫ్ త్వరలో ఐసీసీ ముందు ప్రత్యేక కమిటీకి సంబంధించిన ఈ విషయాన్ని పెట్టనున్నాడని, ఒకవేళ ఐసీసీ నుంచి అలాంటి గ్యారెంటీ వస్తే, జట్టును భారత్‌కు పంపేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా పొందుతుందని తెలుస్తోంది. పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడేందుకు వస్తుందో లేదో చూడాలిక.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్