31.2 C
Hyderabad
Monday, March 30, 2026
spot_img

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో హుండీని పగులగొట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున దుండగులు అనుమానంగా సంచరిస్తుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వద్ద నుంచి 31వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిపై సుమారు 10కేసులు ఉన్నాయని.. ప్రత్యేకంగా ఆలయాల్లో హుండీలను మాత్రమే దొంగలిస్తారని దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్