28.2 C
Hyderabad
Monday, June 5, 2023

దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

జనసేన రెబల్ ఎమ్మెల్యే, వైసీపీ మద్దతుదారుడు రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని స్పష్టంచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈనెల 24న వైసీపీ ఆత్మీయసమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాపాక మాట్లాడుతూ పూర్వం నుంచి తన సొంత గ్రామం చింతలమోరిలో తనకు భారీగా దొంగ ఓట్లు పడ్డాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 20 మంది దాకా వచ్చి ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా దొంగ ఓట్లు వేసేవారని.. దీంతో తనకు 800ఓట్లకు పైనే మెజారిటీ వచ్చేదని తెలిపారు. అప్పటి నుంచి తన గెలుపునకు దొంగ ఓట్లే కారణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాపాక మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. వీడియో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష నేతలు రాపాకను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందనే వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి.

Latest Articles

రెజ్లర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజర్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. శనివారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్