స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖరారైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 8:50 గంటలకు షా ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:45 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం 3:20 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్డీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. హైదరాబాద్ లోని నొవాటల్ లో రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9:30 నిమిషాలకు తిరిగి ఢిల్లీ పయనం అవుతారు.