24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

గాజువాక వైసీపీ సమన్వయకర్తగా అమర్నాథ్

       ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్న వైసీపీ అధిష్టానం 12వ జాబితాను విడుదల చేసింది. అంతకు ముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా వైసీపీ 12వ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్‌చార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్‌చార్జీగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు. దాంతో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పోటీపై సందిగ్ధత తొలిగింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరుకూటి చందుని నియమించింది అధిష్టానం. అయితే చందుని మార్చాలని అధిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి తేవడంతో..అమర్నాథ్ పేరు ప్రకటించింది అధిష్టానం. మరోవైపు కర్నూలు మేయర్ గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్మను నియమిం చింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు. గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్