కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాబోయే ఐదేళ్లలో 20లక్షల మంది యువతీయువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బడ్జెట్లో స్పష్టం చేసిందన్నారు. ఉన్నత విద్యను చదివే విద్యార్థులు పది లక్షల వరకు రుణసహాయాన్ని అందించనుందన్నారు. మూడు కోట్ల మహిళా బడ్జెట్లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. 20లక్షల వరకు గల ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్థాయని చెప్పారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయని బండి సంజయ్ తెలిపారు.