మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రగతినగర్ బతుకమ్మ కుంట వద్ద తేజస్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తేజస్ పాత కేసులలో నేరస్థుడు కాగా… రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అర్థరాత్రి సమయంలో తేజస్ను గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండరాళ్లతో మోది హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


