39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ఘోర ప్రమాదం.. రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికుల మృతి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న  రైల్వే వంతెన కూలిపోవడంతో బుధవారం కనీసం 17 మంది కార్మికులు మరణించారు. ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో 35-40 మంది కార్మికులు ఉన్నారని  పలువురు వ్యక్తులు శిధిలాల కింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుండి ఇప్పటివరకు పదిహేడు మృతదేహాలను వెలికితీశారు. ఇంకా పలువురు వ్యక్తులను వెలికితీయవలసి ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది. కనీసం 15 మంది కార్మికులు మరణించారు. రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం, బాధ కలిగింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి X (అధికారికంగా ట్విట్టర్) లో పోస్ట్ చేసారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్