స్వతంత్ర, వెబ్ డెస్క్: విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ వద్ద నిరసన సెగ కాకరేపుతుంది. అమిత్ షా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏపీకి ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఉద్రిక్త సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.